పవన్-క్రిష్ సినిమా సెట్స్ కోసం భారీ ఖర్చు 


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఒకే సమయంలో రెండు సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పింక్ తెలుగు రిమేక్ మొదలైంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. జెడ్ స్పీడుతో తెలుగు పింక్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం పవన్ కేవలం రూ. 20రోజుల కాల్షీట్లు ఇచ్చినట్టు సమాచారమ్. అంతేకాదు.. తెలుగు పింక్ నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం పెద్దగా డిమాండ్ లేకపోవడంతో పవన్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకొన్నాడని చెప్పుకొంటున్నారు.

మరోవైపు, క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా బుధవారం ప్రారంభం అయింది. ఇదో పిరియాడికల్ చిత్రమని చెబుతున్నారు. దీంతో ఈ సినిమా కోసం దాదాపు రూ. 17  కోట్ల వ్యయంతో సెట్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే వీఎఫ్ఎక్స్ కోసం కూడా భారీగా ఖర్చుపెడతారట. ఈ సినిమాలో పవన్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, మరో హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ నటించనుందని చెబుతున్నారు. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.