తనుశ్రీ హెచ్చరిక : మీ పాపాల చిట్టా నిండింది


బాలీవుడ్ లో #మీటూ ఉద్యమాన్ని ప్రారంభించింది నటి తనుశ్రీ దత్తా. ‘హారన్‌ ఓకే ప్లీజ్‌’ షూటింగ్ సమయంలో తనని సీనియర్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఆయనతో పాటు కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్యపై ఆ రకమైన ఆరోపణలే చేసింది. అప్పట్లో గణేష్ పై తనుశ్రీ చేసిన ఆరోపణలు నిజమేనని ఇప్పుడు రుజువైనట్టయింది. ఇటీవల కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా డ్యాన్సర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనుశ్రీ దత్తా గణేశ్ గురించి స్పందించింది.

మహిళలను వేధింపులకు గురిచేసే ఇలాంటి వ్యక్తులపై బాలీవుడ్‌తోపాటు చిత్ర పరిశ్రమలు కూడా నిషేధం విధించాలని తనుశ్రీ డిమాండ్ చేసింది. బాలీవుడ్‌తోపాటు భారత చలనచిత్ర రంగంలోని అన్నీ పరిశ్రమలు కొరియోగ్రాఫర్‌ గణేశ్‌పై నిషేధం విధించాల్సిన సమయమిది. సినీ పరిశ్రమలోని ఎందరో నటీనటులకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఈ వ్యక్తి.. సినీ పరిశ్రమలో ఉన్న, కొత్తగా వస్తున్న వారిని వేధించడానికి తన ఫేమ్‌ను వాడుకుంటున్నాడు. ఒకరకంగా నా సినీ కెరీర్ నాశనం కావడానికి గణేష్ నే కారణమని ఆరోపించారు. మీ పాపాల చిట్టా నిండింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ పాపాలు బయటకు వస్తాయని గణేష్ ని ఉద్దేశించి తనుశ్రీ కామెంట్ చేసింది.