వాటిపై విరక్తి వచ్చి అలా పోస్ట్‌ పెట్టాను : మాధవీ లత

హీరోయిన్ మాధవీ లత యూ టర్న్ తీసుకున్నారు. మైగ్రేన్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు ఇటీవల మాధవీలత తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె తీవ్ర అనారోగ్యంతో మానసికంగా బాధపడుతున్నారంటూ సోషల్‌మీడియాలో వివిధ రకాలైన పోస్టులు పెడుతున్నారు. మరికొందరైతే ఆమె జీవితం మీద విరక్తి చెందారని పేర్కొంటున్నారు. దీంతో ఫేస్‌బుక్‌ వేదికగా మాధవీ లత మరోసారి స్పందించారు.

“మెడిసెన్స్‌ మీద విరక్తి వచ్చి అలా పోస్ట్‌ పెట్టాను. నాది చిన్న సమస్యంతే. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగానే ఉంటానని భావిస్తున్నాను. నా ఆరోగ్యం గురించి అవాస్తవాలను ప్రచురించడం దయచేసి మానండి. ఇటీవల నేను ‘మందులు మంచివి కాదు.. అవి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి’ అనే పోస్ట్‌ చేశాను. ఆ పోస్ట్‌తో ‘మందులు వాడితే జీవితకాలం తగ్గిదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. నేను షేర్‌ చేసిన పోస్ట్‌ గురించి ఇలాంటి ప్రచారం జరుగుతుందని భావించలేదు” అని ఓ వీడియోని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది మాధవీ లత.