కేంద్ర బడ్జెట్-2020 కౌంట్ డౌన్ స్టార్ట్


కేంద్ర బడ్జెట్-2020కి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కి చేరుకున్నారు.  ఉదయం 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఆమె రాష్ట్రపతిని రామ్ నాథ్ కోవింద్ ని కలిశారు. గత యేడాది మాదిరిగానే ఎర్రటి వస్త్రంతో చుట్టిన సంచీ(బాహీ ఖాటా)లో బడ్జెట్ ప్రతులని తీసుకొచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ కు చేరుకున్నారు. కేంద్ర క్యాబినేట్ సమావేశమై బడ్జెట్ కి ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అత్యంత భద్రతమధ్య బడ్జెట్ ప్రతులని ఇప్పటికే పార్లమెంట్ కి చేర్చారు. మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. పూర్తి స్థాయిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది.