తెలంగాణ బీజేపీ నేతపై లైంగిక ఆరోపణలు

తెలంగాణ భాజాపా నేత రఘునందన్ రావుపై రాధారమణి అనే మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. ఈ మేరకు సైబరాబద్ సీపీ సజ్జనార్‌ ని కలిసి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రఘునందన్‌ రావుపై హెచ్ఆర్సీలో కూడా ఫిర్యాదు చేసినట్లుగా ఆమె తెలిపింది.

రఘునందన్ రావు తెరాస నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2001 ఏప్రిల్ 27 నుంచి 2013 వరకు ఆయన టీఆర్ఎస్‌లోనే కొనసాగారు. 2013 మే 14న రఘునందన్ నావుకు టీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారన్న ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన భాజాపాలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.