చిరు సెట్ కోసం రూ. 20కోట్లు

మెగాస్టార్ చిరంజీవి సలైంట్ గా పని కానిచ్చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే చిరు-రెజీనాపై ఓ ఐటమ్ సాంగ్ ని చిత్రీకరించారు. పాట తర్వాత ఫైట్ అన్నట్టు.. ప్రసుత్తం యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు.

తనపై విరుచుకుపడిన విలన్ గ్యాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్లో రఫ్ ఆడించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట. దేవాలయ భూముల ఆక్రమణ .. ఆ వైపు నుంచి జరుగుతున్న అవినీతికి సంబంధించిన అంశాలతో ఈ కథను తయారు చేసుకున్నారట. సినిమా కోసం హైదరాబాద్ – కోకాపేట్ లో దేవాలయంతో కూడిన కాలనీ సెట్ వేశారు. ఈ ఒక్క సెట్ కోసమే రూ. 20 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఇందులోనే యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు.

సామాజిక సందేశంతో కూడిన పూర్తి వినోదభరితంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరూకి జోడీగా త్రిష నటించనుంది. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారమ్.