తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బన్నీ, త్రివిక్రమ్


‘అల.. వైకుంఠపురంలో’ హిట్ కిక్కులో ఉన్న స్టయిలీష్ స్టార్ అల్లు అర్జు, దర్శకుడు త్రివిక్రమ్ ఈ ఉదయం తిరుమల శ్రీనివారిని దర్శించుకున్నారు. బన్నీ ఫ్యామిలీ కలిసి, త్రివిక్రమ్ సింగిల్ గానే శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం బయటికొస్తున్న బన్నీ, త్రివిక్రమ్ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

త్రివిక్రమ్-అల్లు అర్జున్ లది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయ్. వీరి కాంబో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంక్రాంతి విజేతగా నిలిచింది. ఏకంగా నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసింది. 

ఈ ఆనందంలో ఉన్న అల.. చిత్రబృందం వరుసగా సక్సెస్ మీట్  లని నిర్వహించింది. అభిమానులకి కృతజ్ఝతలు చెప్పింది. ఫైనల్ గా తిరుమల శ్రీనివారిని దర్శించుకొని అల.. హిట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో బన్నీ తదుపరి సినిమా తెరకెక్కనుంది. అతి త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది.