రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళం

దశాబ్ధాలుగా కొనసాగిన ఆయోధ్య వివాదం గత యేడాది పరిష్కారం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని కేంద్ర ప్రకటించింది. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా బిహార్‌ రాజధాని పట్నాలోని మహవీర్‌ ఆలయ పాలక మండలి రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అందులో భాగంగా తొలుత రూ.2 కోట్లను చెక్కు రూపంలో అందజేయనున్నట్లు వెల్లడించింది. మిగిలిన సొమ్మును దశలవారీగా మందిర నిర్మాణ ట్రస్టుకు అందజేస్తామని తెలిపింది.