నేటి ‘సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన’ సాగుతుందిలా.. !


సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనకి బయలుదేరారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత లక్ష్మీబరాజ్‌ను సందర్శించనున్నారు. ఈ ఉదయం 8:50 గంటలకి ప్రారంభమైన సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన మధ్యాహ్నం 1:00 వరకు కొనసాగనుంది. మళ్లీ సాయంత్రంలోగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకుంటారు.

సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన షెడ్యూల్ :

* ఉదయం 8.50 గంటలకు కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి నుంచి రోడ్డుమార్గంలో కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 

* 9.05 గంటలకు హెలికాప్టర్‌లో కాళేశ్వరం బయలుదేరుతారు.

* 9.30 గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 

* అక్కడినుంచి రోడ్డుమార్గంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుని శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు. 

* గోదావరిఘాట్‌ను కూడా సందర్శిస్తారు.

* ఉదయం 10.30 గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అంబట్‌పల్లి గ్రామ పరిధిలోని లక్ష్మీబరాజ్‌కు చేరుకుంటారు. 

* బరాజ్‌ను సందర్శిస్తారు.

* మధ్యాహ్నం 1:00 భోజనం చేసి.. మధ్యాహ్నం 2:00గంటలకి హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు బయలుదేరుతారు

* సాయంత్రం లోగా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.