యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి !

బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆగి ఉన్న ప్రైవేట్‌ బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు. ఆగ్రో-లక్నో జాతీయ రహదారిపై 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఢిల్లీ నుంచి బిహార్‌లోని మోతిహరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నారు.

టైర్ పంచార్ అవ్వడంతో ప్రయివేటు బస్సుని రోడ్డు పక్కన నిలిపినట్టు తెలుస్తోంది. నిలిపి ఉన్న బస్సుని గమనించకుండా లారీ వెనక నుంచి వచ్చి గుద్దేసింది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.