యాదాద్రిలో ఎస్సీ కార్పోరేష‌న్ చైర్మ‌న్.

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేష‌న్ చైర్మ‌న్ పిడ‌మ‌ర్తి ర‌వి యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఉద‌యం హైదరాబాద్ నుంచి నేరుగా యాద‌గిరి గుట్ట‌కు చేరుకున్న ఆయ‌న స్వామివారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌య అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు. అనంత‌రం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా కేంద్రం భువ‌న‌గిరికి చేరుకుని ఎస్సీ కార్పోరేష‌న్ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. విడుద‌లైన నిధులు, ఖ‌ర్చులు, ఎస్సీ అభివృద్ధి పై ఆయ‌న వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.