అక్క‌డ ఇంట‌ర్నెట్ సేవ‌లు క‌ట్..!!!

ఆదివాసి, లంబాడీల మ‌ధ్య వైరం తీవ్ర స్థాయికి చేరింది. ఆదిలాబాద్ లో ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే అక్క‌డ 144 సెక్ష‌న్ విధించారు.. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

ఉట్నూర్ ఆదివాసిలకు లంబాడి తేగలకు జరిగిన గోడవ నేపథ్యంలో తప్పుడు వార్తలను సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్నార‌ని, అందుకే అన్ని కంపెనీల ఇంటర్నెట్ సేవలు జిల్లాలో నిలిపివేశారు. రెండు రోజుల పాటు ఇంట‌ర్నెట్ సేవ‌ల నిలిపివేత అమ‌లులో ఉండ‌నుంది.