శ్రీకాంత్ ఇంట్లో విషాదం


హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి పరమేశ్వరరావు (70) కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలలుగా స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు.

1948 మార్చి 16వ తేదీన కృష్ణా జిల్లా మేకావారిపాలెంలో పరమేశ్వరరావు జన్మించారు. అనంతరం ఆయన కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.