భీష్మ ట్రైలర్.. ఓ కొత్త పాయింట్ !


భీష్మ ట్రైలర్ వచ్చేసింది. వెంకీ కడుముల దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన జంటగా నటించిన చిత్రమిది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఈ వారమే (ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో ఓ కొత్త పాయింట్ ని చూపించారు. ఇన్నాళ్లు ‘భీష్మ’ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ అని మాత్రమే తెలుసు.

ట్రైలర్ లో లవ్ స్టోరీతో పాటు ఓ బలమైన పాయింట్ కూడా ఉందని తెలిసిపోయింది. సినిమాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించేందుకు ఓ పెద్దాయన చేసే ప్రయత్నం. దానికి ఓ విలన్ అడ్డుగా పడటం ట్రైలర్ లో చూడొచ్చు. అయితే, సేంద్రియ వ్యవసాయాన్ని వృద్ధి చేయాలన్న పెద్దాయనకి హీరో నితిన్ సపోర్ట్ చేయడం.. దానికి హీరోయిన్ రస్మికతో లవ్ పాయింట్ ని జత చేసినట్టు ట్రైలర్ తో అర్థమవుతోంది. అన్నట్టు.. ఇందులోనూ నితిన్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని అనుకరించడం మానలేదు. చివరలో నితిన్ చెప్పే డైలాగ్.. పవన్ మేనరిజంతోనే ఉంటుంది.