రస్మిక అర్థరాత్రి ఆ పని చేస్తుందట

సినీ స్టార్స్ కి ప్రైవసీ ఉండదు. ఎక్కడికి వెళ్లినా జనాలు గుర్తుపట్టి.. గుమిగూడేస్తారు. ఈ నేపథ్యంలో సినీ స్టార్స్ ఫారిన్ టూర్ వేస్తుంటారు. కానీ, లోకల్ గా చూడాల్సిన ప్రదేశాలు చూడాలంటే కష్టమే. ఇందుకోసం యంగ్ హీరోయిన్ రష్మిక మందన మాస్టర్ ప్లాన్ వేసుకుందట. బురఖా వేసుకొని ఛార్మినార్ ని చూస్తానని చెబుతోంది. అంతేకాదు.. గోల్కొండ కోటాని చూడాలని ఉందట.

‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రస్మిక. ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ యేడాది సరిలేరు నీకెవ్వరుతో హిట్ అందుకుంది. నితిన్ కి జోడిగా ఆమె నటించిన భీష్మ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రస్మిక భీష్మ హిట్ పై ఆనందం వ్యక్తం చేసింది.

అందరు తనని తెలుగమ్మాయినే అనుకుంటున్నారు. నాకు తెలుగు బాగా వచ్చు. భీష్మ సినిమాకి సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకొన్నా. ఇంకో రెండు, మూడు సినిమాలు చేయాల్సి ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉండాలనిపిస్తోందని చెప్పుకొచ్చింది. ఇక సినిమాలు లేకుంటే ఎక్కువగా జిమ్ లో గడిపేదాన్ని. ఇప్పుడు సమయం దొరకడం లేదు. దీంతో ప్రతిరోజు ఓ గంటపాటు జిమ్ చేస్తానని చెప్పుకొచ్చింది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో రస్మిక హీరోయిన్ గా నటించనుంది. ఇందులో ఆమె డీ గ్లామర్ రోల్ లో కనిపించబోతుందని సమాచారమ్.