ట్రంప్ మోడీ జపం… ఓ వివాదం !


భారత్ అమెరికా అధ్యక్షుడు టంప్ జపం చేస్తోంది. ట్రంప్ మాత్రం ప్రధాని మోడీ జపం చేస్తున్నారు. భారత పర్యటనకి వచ్చిన ట్రంప్ కొద్దిసేపటి క్రితమే సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ట్రంప్ దంపతులిద్దరూ కాసేపు చెరఖాను తిప్పుతూ నూలు వడికారు. ఆ యంత్రం పనితీరును మోడీని అడిగి తెలుసుకున్నారు.

ఆ ప్రాంగణంలోని మూడు కోతుల బొమ్మను ట్రంప్ కు చూపిస్తూ ప్రధాని మోదీ దాని వెనకున్న కథను వివరించారు. ఇక సబర్మతి ఆశ్రమంలోని విజిటర్స్ బుక్ లో ట్రంప్ రాసిన వాఖ్యలపై వివాదం రేగుతోంది. సాధారణంగా ఆశ్రమానికి వచ్చే అతిథులంతా గాంధీజీ గురించి లేదా తమ జీవితాల్లో గాంధీజీ ప్రభావం గురించి రాయడం పరిపాటి. కానీ ట్రంప్ మాత్రం గాంధీజీ పేరును ప్రస్తావించకుండా కేవలం మోదీ గురించే రాశారు. ”టు మై గ్రేట్ ఫ్రెండ్ పీఎం మోదీ.. ఇంత గొప్ప సందర్శన ఏర్పాటుచేసినందుకు థ్యాంక్స్”అని ట్రంప్ సతకం చేశారు.