తాజ్ మహల్’లో ఇవాంక సందడి


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో కలిసి భారత పర్యటనకి విచ్చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం అహ్మ‌దాబాద్‌ లోని మొతేరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ప్రస్తుతం ట్రంప్ ఫ్యామిలీ ఆగ్రాకి చేరుకుంది. తాజ్ మహల్ ని సందర్శిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజ్ మహల్ అందాల ముందు ట్రంప్ కూతురు ఇవాంక అందంగా ఫోటోలకి ఫోజులిచ్చింది. ట్రంప్ దంపతులు సరదాగా తాజ్ మహల్ ని కలియ తిరుగుతున్నారు. ఇక రేపు కూడా ట్రంప్ భారత పర్యటన కొనసాగనుంది. రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందులో ట్రంప్ ఫ్యామిలీ పాల్గొనుంది. ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరుకానున్నారు.