బంగ్లా టార్గెట్ 143

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (39, 17 బంతుల్లో; 2×4, 4×6), జెమిమా రోడ్రిగ్స్‌ (34, 37 బంతుల్లో; 2×4, 1×6) రాణించారు. బంగ్లా బౌలర్లో సల్మ (2/25), పన్నా ఘోశ్‌ (2/25) సత్తా చాటారు.

స్మృతి మంధాన మ్యాచ్‌కు దూరమవ్వడంతో తానియా భాటియా (2)తో కలిసి షెఫాలీ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే తానియా ఆదిలోనే సల్మా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై స్టంపౌటైంది. సెహ్వాగ్‌ శైలిలో షెఫాలీ బౌండరీల మోత మోగించడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.