‘భీష్మ’కు పవర్ స్టార్ ప్రశంసలు

భీష్మకు పవర్ ఫుల్ ప్రశంసలు దక్కాయ్. వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన భీష్మ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా వినోదాత్మకంగా ఉండటంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లికి ముందు దక్కిన ఈ విజయంతో నితిన్ ఆనందంలో ఉన్నారు. ఆయన ఆనందాన్ని డబుల్ చేస్తూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీష్మ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

సోమవారం భీష్మ చిత్రబృందం నితిన్ ని కలిసింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని పవన్ అభినందించారు. సినిమా బాగుందని కితాబిచ్చాడు. దానికి సంబంధించిన ఫోటోలని నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అద్భతమైన క్షణాలు. లవ్ యూ సర్ అంటూ ట్విట్ చేశారు. ఇక మూడ్రోజుల్లో భీష్మ రూ. 14.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. యుఎస్ లోనూ భీష్మ మిలియన్ మార్క్ కి చేరువైంది.