ఆ ఫిగర్’కు ప్రభాస్ పడిపోయాడు


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అసలు ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సినిమా గురించి ఎలాంటి లీకులు రాలేదు. పైగా ప్రభాస్ సందీప్ వంగా చెప్పిన కథని ఓకే చేశారు. చర్చలు జరుగుతున్నాయనే వార్తలొచ్చాయ్. ఈ సినిమా కోస ప్రభాస్ కి ఏకంగా రూ. 50 పారితోషికం కుదిరింది.

అయితే, అంతకు డబుల్ ఆఫర్ చేశారు నిర్మాత అశ్వినీ దత్. అవునూ.. సందీప్ వంగా, నాగ్ అశ్విన్ చెప్పిన రెండు కథలు ప్రభాస్ కి నచ్చాయి. వీటిలో ఏది ఎంచుకోవాలి అనే ఆలోచనలు చేస్తున్న సమయంలో.. ప్రభాస్ ముందు బిగ్ ప్రపోజల్ ఉంచాడు అశ్వినీ దత్. అదేంటంటే.. ? నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తే.. సినిమా బిజినెస్ లో 60 శాతం వాటా ఇస్తానని వాగ్దానం చేశాడట. ఇక్కడే ప్రభాస్ పడిపోయాడు. పైగా సాహో తెచ్చిన నష్టాల్లో ప్రభాస్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నాడు.

ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు నాగ్ అశ్విన్ ప్లాన్ చేసుకున్నాడు. దానికి దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్ అవసరం. అయితే, ప్రభాస్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా సినిమా రూ. 400కోట్ల బిజినెస్ ఈజీగా చేస్తుంది. ఈ లెక్కన ప్రభాస్ కు తనవంతు షేర్ గా 100 కోట్లకు పైగా పారితోషికం వస్తుంది. ఈ అంచనాలతో ప్రభాస్ వెంటనే నాగ్ అశ్విన్ అశ్విని దత్ ల ప్రాజెక్ట్ కు ఓకె చేశాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనె ని ట్రై చేస్తున్నారని తెలుస్తోంది.