ప్రభాస్ అభిమానులకి సప్రైజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి సప్రైజ్ న్యూస్. ‘మిర్చి’ కాంబో రిపీట్ కాబోతుంది. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కొరటాల శివ. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను సినిమాలతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. ఇంకా చెప్పాలంటే.. ? రాజ‌మౌళి తర్వాత అంత నమ్మకున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కొరటాల సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా కూడా కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తోనే తెరకెక్కుతోంది. ‘ఆచార్య’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందులో రామ్ చరణ్ లేదా మహేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోటున్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే హాట్ టాపిక్ గా మారింది. కొరటాలతో సినిమా చేసేందుకు మహెష్, రామ్ చరణ్, ప్రభాస్ లు రెడీ గా ఉన్నారు. అయితే, వీరిలో కొరటాల ఎవరితో మొదట సినిమా చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

ఇప్పటికే కొరటాల మహేష్ తో రెండు సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తో మళ్లీ చేయబోతున్నారు. చరణ్ తో సినిమా అంటున్నారు? ప్రభాస్ సంగతేమిటి ? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే.. ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ఫిక్స్ అయ్యాడు. సైన్స్ ఫిక్షన్ కథతో ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కనుంది. ఆగస్టులో ఈ సినిమా మొదలు కానుంది. పూర్తికావడానికి దాదాపు యేడాదిన్నర పట్టనుంది. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఏమాత్రం ఆలస్యమైనా.. కొరటాల-ప్రభాస్ కాంబోలో రెండో సినిమా తెరకెక్కనుంది. లేదంటే.. మహేష్ లేదా రామ్ చరణ్ తో కొరటాల సినిమా ఉండొచ్చని ఫిల్మ్ నగర్ సమాచారమ్.