యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవలో సత్యవతి రాథోడ్


యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జ‌రిగింది. స్వామివారి కళ్యాణమహోత్సవంలో దేవ‌దాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్వామి వారికి ప్ర‌భుత్వం త‌ర‌పున‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

ఇక ఈరోజు గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.మంత్రి సత్యవతికి ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. గత నెల 26న ప్రారంభమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల  7 వరకు కొనసాగనున్నాయి. 7న అష్టోత్తర శతఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవం ముగుస్తుంది.