తెలంగాణ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ విడుదల

దేశంలో పరీక్ష కాలం మొదలైంది. తెలంగాణలో ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షలు మొదలయ్యాయ్. అవి పూర్తవ్వగానే పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. ఆ తర్వాత డిగ్రీ, పీజీ పరీక్షలు జరగనున్నాయి. తాజాగా తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదలైంది. ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ పురుషోత్తం ఐసెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 

ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30 తుది గడువుగా నిర్ణయించారు. రూ.500 ఆలస్య రుసుముతో మే 14 వరకు, రూ. 5 వేల ఆలస్య రుసుముతో మే 16 వరకు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం కల్పించారు. మే 20, 21 తేదీల్లో ఐసెట్‌-2020 పరీక్షను నిర్వహించనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి తెలిపారు.