‘నిశ్శబ్ధం’ ట్రైలర్ టాక్

అనుష్క, మాధవన్‌, అంజలి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ‘నిశ్శబ్ధం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం నేచురల్ స్టార్ నాని ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్‌ను చూస్తుంటే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. అయితే ట్రైలర్ లో కథని ఏమాత్రం రివీల్ చేయకుండా.. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో కట్ చేశారు. అవి ఆకట్టుకున్నాయి. ‘భాగమతి’ తర్వాత అనుష్క కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.