ఈటెల సాహసం చూశారా ?


కరోనా వైరస్ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తోంది. తెలంగాణ వైద్య మంత్రిగా ఉన్న ఈటెల ఆసుపత్రుల తనిఖీలు, డాక్టర్లతో భేటీలు తప్పనిసరి. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటికి వచ్చేముందు ఆపీసులో స్నానం చేసి రావాలని కుటుంబ సభ్యులు సూచించారట. దీని గురించి శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో చెప్పుకొని ఈటెల బాధపడినట్టు తెలిసింది.

ఇక శనివారం ఈటెల గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఏకంగా కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డుకి వెళ్లారు. కరోనా పాజిటివ్ రోగితో స్వయంగా మాట్లాడి.. ఆరోగ్య పరిస్థితిని గురించి వాకాబు చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా పాజిటివ్ వ్యక్తులకి చికిత్స చేయడానికి డాక్టర్లే జంకుతున్నారు. అలాంటిది ఈటెల వారి దగ్గరికి దగ్గిరికి వెళ్లి.. వారితో మాట్లాడటం సాహసమే అంటున్నారు నెటిజన్స్.