తండ్రి మరణంపై అమృత షాకింగ్ రియాక్షన్

ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని తెలుస్తోంది. తండ్రి మరణంపై అమృత స్పందించింది. తన ఇంటికి వచ్చిన మీడియాతో మాట్లాడిన అమృతలో తండ్రి చనిపోయిన బాధ ఏమాత్రం కనిపించలేదు. అసలు తండ్రి మృతి చెందాడన్న న్యూస్ నిజామా ? కాదా ?? కూడా తమకి క్లారిటీ లేదని.. బహుశా.. పశ్ఛాతాపంతోనే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అభిప్రాయపడింది.

ఇటీవల కాలంలో మీ తండ్రి మీతో మాట్లాడారని తెలిసిందని మీడియా ప్రశ్నించగా.. తన భర్త ప్రణయ్‌ హత్య జరిగిన తర్వాతి నుంచి మారుతీరావుతో మాట్లాడడం లేదని తెలిపింది. ప్రణయ్‌ను హత్య చేయించినందుకు పశ్చాత్తాపపడే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడేమోనని చెప్పింది.

అన్న మరణంపై మారుతిరావు సోదరుడు శ్రవణ్‌ స్పందించారు. అన్నతో తనకెలాంటి విబేధాలు లేవ్. గత ఏడాది మే 15లో చివరిసారిగా అన్నతో మాట్లాడా. ప్రణయ్‌ హత్య కేసు నేపథ్యంలో అనవసరంగా తాను ఈ కేసులో ఇరుక్కున్నాననే ఆయనతో మాట్లాడటం లేదు. అంతేతప్ప తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పుకొచ్చాడు.