రూ.50 లక్షలు పెట్టి కథ కొన్న నాని

నేచురల్ స్టార్ నానికి కథల ఎంపికలో మంచి టేస్ట్ ఉంటుంది. అందుకే ఆయన సినిమాలు బాగా ఆడతాయ్. ఇండస్ట్రీ డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఏకైక హీరో నానినే. అయితే తాజాగా నాని ఓ కథని రూ.50లక్షలు పెట్టిన కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ‘వి’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు.

ఇటీవల తన కొత్త ప్రాజెక్టు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. మేలో సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోందట.

ఈ సినిమా కథను నాని రూ.50 లక్షలు పెట్టి కొన్నారని సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ఆడియో కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్‌ వద్ద ఆయన దీన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. నానికి కథ బాగా నచ్చడంతో ఎక్కువ మొత్తం ఇచ్చి, తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో  నిజమెంత ? అనేది తెలియాలంటే.. నాని స్పందించాల్సిందే.