జూన్-సెప్టెంబర్’లో ఐపీఎల్ 

ఈ నెల 29 నుంచి ప్రారంభం కావాల్సిన కరోనా కారణంగా ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 నుంచి కూడా ఐపీఎల్ జరుగుందనే గ్యారెంటీ లేదు. ఈలోగా దేశంలో కరోనా వైరస్ అదుపులోనికి వస్తుందని చెప్పలేం. తాజా సమాచారమ్ ప్రకారం ఐపీఎల్‌ను జూన్‌-సెప్టెంబర్ మధ్యలో నిర్వహిస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ యోచిస్తోందట.

ఐపీఎల్ ని బయట నిర్వహించే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. ఐపీఎల్‌-2009ని దక్షిణాఫ్రికాలో 37 రోజులు నిర్వహించారు. ఇప్పుడూ పరిస్థితులు అనుకూలిస్తే కొన్ని రోజులు విదేశాల్లో, కొన్ని రోజులు స్వదేశంలో నిర్వహించేందుకు యోచిస్తున్నారు. కొవిడ్‌-19 వ్యాప్తిని బట్టి మొత్తం టోర్నీని తరలిస్తే ఎలా ఉంటుందని చర్చించారట. మినీ ఐపీఎల్ లేదంటే జూన్-సెప్టెంబర్ ఐపీఎల్ ని నిర్వహించడం చేయొచ్చని తెలుస్తోంది.