ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయించింది. బుధవారం వరకు తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే కరీంనగర్ లో 8మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం కలకలం రేపింది. ఇండోనేషియా నుంచి వచ్చిన బృందంలో 8మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీ నుంచి రైలులో కరీంనగర్ చేరుకున్న ఇండోనేషియా బృందం కరీంనగర్ లో పలు ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ నేపథ్యంలో ఇండోనేషన్ బృందం కలిసిన వారికి కరోనా సోకే ప్రమాదముంది. వారిని గుర్తించి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అయితే వారి గుర్తించడం ఎలా అన్నది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.