కరోనా.. రాధిక సేఫ్ !

కరోనా ఎఫెక్ట్ తో విదేశీ ప్రయాణాలు చేయడం సాహసమే అవుతోంది. ఏమాత్రం అస్వస్థతగా ఉన్నట్టు తేలినా.. ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అయితే భారత్ నుంచి లండన్ వెళ్లిన హీరోయిన్ రాధిక ఆప్టే మాత్రం తాను సేఫ్ అని ప్రకటించింది. దక్షిణాది కన్నా బాలీవుడ్‌లో, హాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతలు గడిస్తున్న హీరోయిన్‌ రాధికా ఆప్టే తాజాగా ఇండియాకు వచ్చింది. వచ్చిన పని ముగియగానే తిరుగు ప్రయాణమై లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో దిగింది.

విమానాశ్రయంలో రాధికకి ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం అనుకున్నారు. కానీ తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని, ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని రాధిక స్పష్టం చేసింది. స్నేహితులు, బంధువుల నుంచి నాకు ఎన్నో మెస్సేజ్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. మీరు కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు. నేను లండన్‌లో క్షేమంగా దిగాను. అక్కడ నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయం అంతా నిర్మానుష్యంగా ఉందని తన ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చింది.