ధోని విలువైన ఆస్థి : జాఫర్

మహేంద్రసింగ్ ధోనిని మించి చూడాల్సిన పనిలేదు. ఆయన టీమిండియాకు విలువైన ఆస్థి అన్నారు మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌.జాఫర్‌ ట్విటర్‌లో ధోనీపై స్పందించాడు. భారత జట్టు ధోనిని  మించి చూడాల్సిన అవసరం లేదన్నాడు. ధోనీ ఫిట్‌నెస్‌తోపాటు ఫామ్‌లో ఉంటే మనం అతడిని మించి చూడాల్సిన పనిలేదు. వికెట్ల వెనుక, లోయర్‌ ఆర్డర్‌లో అతను ఎంతో విలువైన ఆటగాడు.

ధోనీని ఆడిస్తే కేఎల్‌ రాహుల్‌పై భారం తగ్గుతుంది. అలాగే రిషభ్‌ పంత్‌ను కూడా లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌గా టీమ్‌ఇండియా ఉపయోగించుకోవచ్చు అని జాఫర్‌ రాసుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్‌ తర్వాత ధోని క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లతో సాధన మొదలుపెట్టినా.. కరోనా వైరస్‌(కొవిడ్‌ 19) కారణంగా అది కూడా నిలిచిపోయింది.