కరోనా ఎఫెక్ట్ : యాదాద్రి ఆలయం మూసివేత

కరోనా వైరస్ దేవుళ్లని వదలడం లేదు. కరోనా ప్రభావంతో దేశంలోని ఆలయాలు మూతపడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం తిరుమల కొండపైకి భక్తులని అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటికే అలిపిరి చెక్ పోస్ట్ ని మూసేశారు. మెట్ల మార్గం కూడా మూసివేయబడింది. తిరుమల ఆలయాన్ని తాత్కాళీకంగా మూసివేయనున్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణ తిరుపతి యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామికి కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ నెల 31 వరకు యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. యాదగిరి గుట్ట ప్రాంతంలో కరోనా ప్రభావం లేకపోయినా.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక తెలంగాణలో  ఇప్పటికే 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.