రమ్యకృష్ణకి ముఖ్యమంత్రి పదవి

సీనియర్ హీరోయిన్, శివగామి రమ్యకృష్ణకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు. ఆమె కూడా దానికి ఓకే చెప్పినట్టు సమాచారమ్. దేవాకట్టా దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇప్పుడీ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. రాజకీయం నేపథ్యంలో సాగే సోషల్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందట. ఇందులో సాయితేజ్ డాక్టర్ గా కనిపిస్తాడట. ఏలూరు, కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. మరి రాజకీయాలకు డాక్టర్ వృత్తికి ఎలా ముడిపెట్టాడు అన్నది ఆసక్తికర పాయింట్ గా ఉంటుందట. అంతేకాదు.. ఇందులో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను పోషించనుందట. అయితే దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

వరుస ప్లాపుల్లో ఉన్న సాయితేజు చిత్రలహరితో హిట్ ట్రాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ పండగే సినిమాతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కతోంది. ఈ సినిమా తర్వాత దేవాకట్టా దర్శకత్వంలో సాయితేజు సినిమా ఉండనుంది.