బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ చేసిన కరోనా రచ్చ

బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు కేంద్రాన్ని గజ గజ వణికిస్తోంది. ఏకంగా పార్లమెంట్ సమావేశాలే వాయిదా పదేలా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ? సింగర్ కనికకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెని క్వారంటైన్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆమె కేంద్రమంత్రులు, ఎంపీలకి కరోనా వైరస్ అంటించినట్టు తెలుస్తోంది.

ఇటీవలే కనిక కపూర్ లండన్ వెళ్లొచ్చారు. ఆ విషయం దాచేసి.. ఏం చక్కా.. లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో  నిర్వహించిన పార్టీకి హాజరయింది. ఈ కార్యక్రమానికి ఎంపీ దుష్యంత్ సింగ్ హాజరయ్యారు. ఆయనతో కనిక దగ్గర్నుంచి మాట్లాడింది. ఆ తర్వాత దుష్యంత్ పార్లమెంట్ సమావేశాలకి హాజరయ్యారు. ఇప్పుడు కనిక కపూర్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. దుష్యంత్ సింగ్ పాటు,కేంద్ర మంత్రులు, ఎంపీలందరూ అలర్ట్ అయ్యారు. వీరంతా సెల్ఫ్ క్వారెంటైన్ లోకి వెళ్లిపోతున్నారు.