@మోత్కుప‌ల్లి: కేసీఆర్.. నీకొడుకును సీఎం చేసుకో… !!!

మంద‌కృష్ణ మాదిగ అరెస్టును నిర‌సిస్తూ టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి ట్యాంక్ బండ్ అంబెద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద మౌన దీక్ష చేప‌ట్టారు. దీక్ష అనంత‌రం ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఒక‌వైపు కేసీఆర్ ను, టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూనే మ‌రో వైపు కేసీఆర్ కు అనుకూలమే అన్న భావ‌న వ‌చ్చేలా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి..

కేసీఆర్ నిన్ను దించ‌డానికి కుట్ర‌లు జ‌రుగుతున్నాయి.. ఆ కుట్ర‌లు చేసే బ్యాచ్ లో తాము లేము అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆ అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని, కానీ మాదిగ జాతి జోలికి వ‌స్తే కేసీఆర్ ను దించేందుకు కూడా వెన‌కాడ‌మ‌న్నారాయ‌న‌. కేసీఆర్ నీ కొడుకును సీఎం చేసుకో మాకు అభ్యంత‌రం లేదు , కానీ త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌మ‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కోరారు. ఏమైనా మోత్కుప‌ల్లి కామెంట్స్ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయ‌ని చెప్పొచ్చు.