విదేశీయులపై సీఎం కేసీఆర్ సీరియస్ యాక్షన్

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తికి విదేశాల నుంచి వారే కారణమని సీఎం కేసీఆర్ అన్నారు. విదేశీయుల నుంచి వచ్చినవారే సమస్తే. ఇప్పటి వరకు 20వేల పైచిలుకు విదేశాల నుంచి వచ్చారు. వీరిలో 11వేల మందికిపైగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నారు. అదేసమయంలో విదేశాల నుంచి వచ్చిన వారికి సీఎం కేసీఆర్ సీరియస్ గా సూచనలు చేశారు.

విదేశాల నుంచి వచ్చిన వారు దైర్ఘ్యంగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. అనవసరంగా మీ కుటుంబానికి, ఇతరులకి నష్టం కలిగించకండి. ఇది సామాజిక బాధ్యత. స్వచ్చందంగా ప్రభుత్వానికి సహకరించండని సూచించారు. సామాజిక బాధ్యతని పాటించాలన్నారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బంది ఉన్న తక్షణం రిపోర్ట్ చేయాలని సూచించారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో మీ సహకారం అవసరం అన్నారు.