వారిని అరెస్ట్ చేయండీ.. సీఎం కేసీఆర్ ఆదేశం !

సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ జోకులు వేయడంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. కరోనా కట్టడి కోసం తీసుకొంటున్న చర్యల్లో భాగంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రధానిపై చిల్లర కామెంట్స్ చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. వారిపై చర్యలు తీసుకోమని డీజీపీని ఆదేశించాం. వారిని తక్షణమే అరెస్ట్ చేయమన్నారు.

ఆదివారం సాయంత్రం 5గంటలకి ప్రజలంతా బయటికొచ్చి చప్పటలు కొట్టమన్నది జాతి ఐక్యతని చెప్పేందుకు  మాత్రమే. దానిపై జోకులు ఎందుకు ? ప్రధానినే అవమానించే కామెంట్స్ పెడతారా ? అంటూ సీరియస్ అయ్యారు. తాను కూడా రేపు సాయంత్రం 5గంటలకి బయటికొచ్చి చప్పట్లు కొడతా. ఈ చప్పట్లకే మహమ్మారి కరోనా పారిపోవాలన్నారు సీఎం కేసీఆర్.