రత్నవేలు ఇంట్లో విషాదం

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలుకు మాతృవియోగం కలిగింది. రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి రామన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు రత్నవేలు కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

సౌత్‌ ఇండియాలోనే టాప్‌ మోస్ట్‌ సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరు.ఖైదీ నెం150, సైరా, రంగస్థలం, రోబో, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు ఆయన పనిచేశారు. ప్రస్తుతం భారతీయుడు 2కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సుకుమార్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ సినిమాకి రత్నవేలు పని చేస్తున్నారు.