దిల్ రాజుకి పవన్ హామీ.. ఏంటంటే ?

అందరికీ కరోనా ఫీవర్ పట్టుకుంటే నిర్మాత దిల్ రాజుకి మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫీవర్ పట్టుకుంది. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్స్, రిలీజ్ డేట్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగాధి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘వి’ సినిమా వాయిదా పడింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు కథానాయకులుగా ఈ సినిమా తెరకెక్కింది.

ఇక ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘వకీల్ సాబ్’ కూడా వాయిదా పడింది. ఈ రెండు సినిమాలకి దిల్ రాజునే నిర్మాత. పవన్ వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఏకకాలంలో షూటింగ్స్ జరుపుకోవాల్సి ఉంది. అయితే ఏప్రిల్ పవన్ కాల్షీట్లు మాత్రం క్రిష్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ విడుదల మరింత ఆలస్యం అయ్యేలా ఉందని దిల్ రాజు ఆందోళన చెందుతున్నారట. 

అయితే పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కల్యణ్ దిల్ రాజుకి ఓ మాటిచ్చారట. మొదట వకీల్ సాబ్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాతే క్రిష్ సినిమా చేస్తానని చెప్పారట. దీంతో దిల్ రాజు ఊపిరిపీల్చుకున్నారు. కరోనా కారణంగా వచ్చిన సెలవులని ఇంట్లో కూర్చొని గడేపిస్తున్నారట. ఇక ఈ రెండు సినిమాలతో హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ సినిమాలు ఉండనున్నాయి.