హైద‌రాబాద్: ప్రేమోన్మాదానికి యువ‌తి బ‌లి..!!

హైద‌రాబాద్ లో ప్రేమోన్మాదానికి మ‌రో యువ‌తి బ‌లైంది. గురువారం లాలగూడ లో రాత్రి తొమ్మిది గంటలసమయంలో సంధ్య రాణి అనే యువ‌తిపై పెట్రోల్ పోసి అంటించి పరారయ్యాడు ఓ ప్రేమోన్మాది. గాంధీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం ఆయువ‌తి మృతిచెందింది. సంధ్యారాణిపై దాడి చేసిన యువ‌కుడు కార్తిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కార్తీక పై /ష్ట్రఢ‌ 302 , 354, 354D, కేసులు నమోదు చేసిన‌ట్లు పోలీసులు తెల‌లిపారు. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ కేస్ నమోదు చేశాం సెక్షన్ (3 i i) sc st poa ,కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

రెండేళ్లుగా కార్తిక్ తో తన పరిచయం ఉన్నట్లు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. ప్రేమ పేరుతో వేధింపులు కి గురి చేస్తున్నాడు అంటూ సంధ్య ఇచ్చిన స్టేట్ మెంట్ రికార్డ్ చేశారుపోలీసులు. దగ్గర లో ఉన్న షాప్ యజమాని కి కార్తిక్ ని మందలించాడని, షాప్ యజమాని జగన్ రెడ్డి తో జరిగిన సంభాషణ ఆధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు.

మల్కాజ్ గిరి వద్ద పెట్రోల్ బంక్ లో కార్తిక్ పెట్రోలు కొనుగోలు చేశాడు. ఏడాది క్రితం లక్కీ ట్రేడర్స్ లో సంధ్య , కార్తిక్ పని చేశారు.అప్పుడే సంధ్య ని ప్రేమించాడు, ఆమె అత‌ని ప్రేమను నిరాకరించింది. సంధ్య డిగ్రీ చదువుకున్న అమ్మాయి, కార్తిక్ 7 తరగతి చదువుకున్నాడు.కార్తీక్ ఆవారగా తిరిగే వాడని, దీంతో ఆమె ప్రేమ ని నిరాకరించిందని కుటుంబ స‌భ్యులు తెలిపారు.