64 దేశాలకి అమెరికా కరోనా సాయం.. భారత్ కు కూడా !

అగ్రరాజ్యం అమెరికా 64 దేశాలకి కరోనా సాయం ప్రకటించింది. మొత్తం 174 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో ఇండియాకు 2.9 మిలియన్ డాలర్ల సహాయం అందనుంది. ఇది గత ఫిబ్రవరిలో ప్రకటించిన 100 బిలియన్ డాలర్ల సాయానికి అదనం. శ్రీలంకకు 1.3 మిలియన్ డాలర్లు, నేపాల్ కు 1.8 మిలియన్లు, బంగ్లాదేశ్ కు 3.4, ఆఫ్ఘనిస్థాన్ కు 5 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం లభించనుంది.

ఓ వైపు అమెరికాలో కరోనా బాధితుల మరణాలు, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, అమెరికా ఇలా ఇతర దేశాలకు భారీ ఆర్ధిక సహాయం ప్రకటించడం విశేషం. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చైనా, ఇటలీని మించిపోయాయ్. అయితే కరోనా మరణాల సంఖ్య అమెరికాలో తక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం.