రాధికకి కరోనా.. క్లారిటీ ఇచ్చింది !

హాలీవుడ్ లోనూ రాణిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే హాస్పటల్ లో చేరింది. మొహానికి మాస్క్ తో హాస్పటల్ లో ఉన్న ఫోటో ఒకటి రాధిక తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకి కరోనా సోకిందని అందరు భావించారు. కరోనా నుంచి రాధిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్ పెట్టారు.  రాధిక ఫొటో చూసి ‘గల్లీబాయ్’ ఫేమ్ విజయ్ వర్మ.. ‘ఓ గాడ్.. జాగ్రత్త డార్లింగ్.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో రాధికకి కరోనా సోకిందని అందరు ఫిక్సైపోయారు.

తాజాగా హాస్పటల్ లో ఫోటోపై రాధిక క్లారిటీ ఇచ్చింది. తాను కరోనా వైరస్ బారిన పడలేదని స్పష్టం చేసింది. ‘నేను హాస్పిటల్‌కు వెళ్లాను. అయితే కోవిడ్-19 పరీక్షల కోసం మాత్రం కాదు. నేను ఆరోగ్యంగానే ఉన్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి” అని రాధిక పోస్ట్ పెట్టింది. అయితే హాస్పిటల్ కి ఎందుకు వెళ్లినట్టు అనే విషయాన్నిమాత్రం చెప్పలేదు.