మాట‌ల్లేవ్..! లేఖ‌లే..!! : మంత్రి కేటీఆర్ కు కోమ‌టి రెడ్డి లేఖ

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వాక్బాన‌లు ప‌క్క‌న బెట్టి లేఖాస్ట్రాల‌కు ప‌ని చెప్పిన‌ట్టున్నారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎప్పుడు ఎవ‌రిపై మాట‌ల తూటాలు విసురుతారో చెప్ప‌లేం.. వారు నోరు తెరిస్తే చాలు పంచ్ ప‌డాల్సిందే.. అవ‌త‌లి వైపు ఉన్న‌ది ఎవ‌రైనా స‌రే తాము అనుకున్న‌ది అనేయాల్సిందే..

అయితే తాజ‌గా కోమ‌టిరెడ్డి త‌న వైఖ‌రి మార్చుకున్నారో లేకపోతే మాట‌ల‌తో కావ‌డం లేద‌ని అనుకున్నారోగానీ లేఖ‌లు పంపించ‌డం మొద‌లు పెట్టారు. అదీ న‌ల్గొండ‌, మిర్యాల‌గూడ అభివృద్ధిపైనే. విమ‌ర్శ‌ల‌ను, త‌మ సొంత స్టైల్ ను ప‌క్క‌న బెట్టి మంత్రి కేటీఆర్ కు స‌వివ‌రంగా లేఖ రాశారు. న‌ల్గొండ‌, మిర్యాల‌గూడ ప‌రిధిలో మునిసిపాలిటీల్లో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీల‌ను పూర్తి చేయాల‌ని, చాలామంది అనారోగ్యం పాల‌వుతున్నారంటూ లేఖ‌లో పేర్కొన్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

ఇందుకోసం 16.17కోట్ల రూపాయ‌ల నిదులు విడుద‌ల చేయాల్సి ఉంద‌ని, వెంట‌నే ఆ ప‌నులు మొద‌లు పెట్టి, న‌ల్గొండ‌, మిర్యాల గూడ మునిసిపాలిటి ప్ర‌జ‌ల ఇబ్బందులు తొల‌గించాల‌ని కోరుతున్నానంటూ లేఖ రాశారు. ప్ర‌స్తుతం ఈ లేఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది స్ట్రాట‌జీనా లేక అభివృద్ధి కోస‌మా తెలియ‌దుగానీ మొత్తానికీ కోమ‌టి రెడ్డి లేఖ రాయ‌డం మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి లోన‌య్యేలా చేస్తోంద‌న్న మాట మాత్రం నిజం..