దారుణం : అమ్మకానికి ఐక్యతా విగ్రహం

కరోనా మహమ్మారి విజృంభిస్తుండంతో దేశం బాధలో ఉంది. ఈ సమయంలో కొందరు ఆకతాయిలు పైత్యం చూపిస్తున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ దీపాలు వెలిగింమని కోరితే.. కొందరు టపాసులు పేల్చారు. ఇప్పుడు ఏకంగా కరోనా విరాళాలని అపహ్యాస్యం చేస్తూ.. ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఎతైన ఐక్యతా విగ్రహన్ని (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ) ఓఎల్‌ఎక్స్‌ లో పెడుతున్నట్లు ప్రకటన ఉంచారు.

రూ.30,000 కోట్లకు ఈ విగ్రహన్ని విక్రయిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన ఐక్యతా విగ్రహ నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. మోసానికి పాల్పడడం, అంటువ్యాధుల నివారణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రకటనను ఓఎల్‌ఎక్స్‌ తమ వెబ్‌సైట్‌ నుంచి తీసివేసి.. క్షమాపణలు కూడా చెప్పింది.