బ్రిటన్ ప్రధాని అనారోగ్యంపై మన ప్రధాని ట్విట్ 

బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కరోనాతో ఐసీయూలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలు జాన్సన్‌ ఆకాంక్షించారు. అమెరికా ప్రజలంతా బోరిస్‌ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారని అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. ఈ క్రమంలో బ్రిటన్‌ ప్రభుత్వానికి అన్ని రకాలు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ సైతం బోరిస్‌ ఆరోగ్యంపై వాకబు చేశారు. అతిత్వరలో కోలుకొని విధుల్లో చేరతారని ఆకాంక్షించారు. భారతప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ”బోరిస్‌ జాన్సన్‌ అతిత్వరలో ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను” అని ట్వీట్‌ చేశారు.