ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందకండీ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు సాహో సినిమాపై భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలని సాహో అందుకోలేకపోయింది. ఇక సాహో తర్వాత రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఇదో ప్రేమకథా చిత్రమ్. పునర్జన్మల నేపథ్యంలోయూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకొంది.

ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్స్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా అందరం చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మా సినిమా పనులన్నింటికి తాత్కాలిక బ్రేక్ వేసాం. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మరిన్ని అప్‌డేట్స్‌తో వస్తాము. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని మేము కోరుతున్నామని పేర్కొన్నారు.