కరోనాతో కలత చెందొద్దు : హరీష్

కరోనా వైరస్ వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి హరీష్ రావు. మంగళవారం సిద్ధిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో 104 మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12కిలోల బియ్యం, ఒక్కొక్కరికీ రూ.500 రూపాయల నగదును మంత్రి హరీష్ అందజేశారు. ఆ తర్వాత గజ్వేల్ మండలం రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్, కొత్త ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. “కరోనా వైరస్ అందరినీ పరేషాన్ చేస్తోంది. తెరాస ప్రభుత్వం అందర్నీ సొంత మనుషుల్లా చూసుకుంటుంది. ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, 500 రూపాయలు ఇస్తున్నాం. మనమంతా ఒకటే, ఎవరికి ఏ సమస్యా వచ్చిన మా దృష్టికి తెస్తే సహాయం అందిస్తాం. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటించాలి” అన్నారు.