త్రిష వివాదంపై ఆరా తీసిన చిరు

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోయిన్ గా త్రిష తీసుకున్నారు. అయితే ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రకటన చేసి షాక్ ఇచ్చింది. క్రియేటివ్ డిఫరెన్స్ వలనే సినిమా నుంచి తప్పుకున్నట్టు త్రిష ట్విట్ చేసింది.

చిత్రబృందం నుంచి మాత్రం త్రిష తప్పుకోవడంపై ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి త్రిష వ్యవహారంపై స్పందించారు. ‘త్రిష మేటర్ పై ఆరా తీశాను. నేను అందరితో మాట్లాడాను ఎవరికి ఆమెతో విభేదాలు లేవు. అయినా ఆమె సినిమా నుండి తప్పుకుంది. ఎందుకంటే ? మణిరత్నం సినిమాలోనూ ఆమెకు అవకాశం వచ్చింది. దాంతో.. ఆమె ఆచార్య నుండి తప్పుకుంది’ అంటూ చిరు కుండబద్దలు కొట్టేశారు.

ఇక త్రిష స్థానంలో కాజల్ ని తీసుకున్నారు. అయితే ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందనే వార్తలు వినిపించాయి. చిరుతో కాజల్ జోడి కట్టడం ఇది రెండోసారి. గతంలో చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం.150లో కాజల్ నటించింది. ఇక కరోనా ప్రభావంతో ఆచార్య షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గాక తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది.