కేజీఎఫ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా ఫిక్స్ ?

టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, మహేష్, ఎన్ టీఆర్ ఇద్దరూ తమ తదుపరి సినిమాలని ప్రకటించేశారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సినిమా తెరకెక్కనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఫిక్స్ అయింది. ఇక నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉండనుంది.
 
అయినా.. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా ఉండనుందని సమాచారమ్. ఇప్పటికే మైత్రీ మూవీస్ అడ్వాన్స్ ప్రశాంత్ నీల్ దగ్గర ఉందట. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేసేందుకు మైత్రీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అవి ఫలించాయని కూడా చెప్పుకొంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇది ఎమోషన్స్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ అట. ఈ సినిమా తరువాత ప్రభాస్ సినిమా నాగ్ అశ్విన్ తో ఉండనుంది. ఆ తర్వాత అన్నీ కుదిరితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండనుందని తెలుస్తోంది.