లాక్ డౌన్ ప్రై ప్రధాని ప్రకటన.. ఈరోజే !

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా కలకలం మొదలైన తర్వాత ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడటం ఇది మూడోసారి. దేశంలో కరోనా కట్టడి కోసం ప్రధాని ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా లాక్ డౌన్ పొడగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నేడు దీనిపై ప్రకటన చేయనున్నారు.

ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉంది. నమోదైన కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది.